బీజేపీ ని ఎదుర్కొనే ధైర్యం టిఆర్ఎస్ కు లేకనే దాడులు

బీజేవైఎం జిల్లా నాయకులు మంజునాథ్, మహేష్ సాగర్

మక్తల్ జూలై 16 (జనంసాక్షి)
బీజేపీ ని ఎదుర్కొనే ధైర్యం లేకనే భౌతిక దాడులకు దిగుతున్నారని బీజేవైఎం జిల్లా నాయకులు అన్నారు మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేవైఎం జిల్లా నాయకులు మంజునాథ్, మహేష్ సాగర్ మాట్లాడుతూ ప్రజల రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ను టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకొని ఆయన కారు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూమన్నారు.ఈ టీఆర్ఎస్ రాజకీయంగా ఎదుర్కోలేక ఎదురుదాడులకు దిగుతుందన్నారు. నిజంగానే రైతులకు మేలు చేసినట్లయితే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలు గురించి చెప్పుకోవాలి కాని దాడులకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ఎన్ని దాడులు చేసిన టిఆర్ఎస్ దౌర్జన్యాన్ని తట్టుకొని నిలబడి అవినీతిపై బిజెపి పోరాటం కొనసాగిస్తుందన్నారు. రానున్నది బిజెపి ప్రభుత్వమేనని తెలంగాణ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారనే విశ్వాసం తమకుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యువరాజ్, బి.శేఖర్, మల్లేష్, బాలరాజ్, రఘు తదితరులు పాల్గొన్నారు.