బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, తంగెళ్ళపల్లి వెంకట సత్య నారాయణచారి కు ఘన నివాళి.
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్. మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు తంగెళ్ల పల్లివెంకట సత్యనారాయణా చారి ప్రథమ వర్ధంతి సభకు హాజరైన బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు, బీసీ సంక్షేమ సంఘం నేరేడుచర్ల మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి సుందరయ్య టీవీయస్ఎన్ ఆచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ.నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వామపక్ష ఉద్యమంలో చురుకుగా పనిచేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నేరేడుచర్లలో మొట్టమొదటి టీఆర్ఎస్ జెండా ఎగరవేసిన ఘనత ఆచారిదని, నేరేడుచర్ల మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని తన ఒంటిపై ఉన్న చొక్కాను తీసివేసి గాంధీ విగ్రహానికి స్థలం సేకరించి,విగ్రహ ప్రతిష్ట తర్వాతే తన ఒంటిపై చొక్కా వేసుకున్నారని వారు గుర్తు చేశారు.
నేటి యువత టీవీఎస్ ఎన్ ఆచారి గారి మార్గాన్ని అనుసరించాలని, ఆయన నిజాయితీని, నిస్వార్థ సేవను, ఆయన త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మాజీ సర్పంచ్, ఆకారపు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సత్రం కమిటీ అధ్యక్షులు తునికి పాటి మల్లాచారి, ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, తునికి పాటి జగన్నాథచారి, జానకి రాములు సూరోజు సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
