బీహార్‌ సిఎం నితీశ్‌కు కరోనా

దేశంలో 14వేలకు పైగాకేసుల నమోదు

న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆయన
గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిండ్‌ వీడ్కోలు, రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు కూడా నితీశ్‌ హాజరుకాలేకపోయారు. మరో వైపు దేశ్యాప్తంగా 14 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి .దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,830 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి నుంచి 18,159 మంది కోలుకున్నారు. మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,39,20,451కు చేరింది. ఇప్పటి వరకు 4,32,46,829 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌ కారణంగా 5,26,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.34శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.47శాతంగా ఉందని పేర్కొంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.84శాతం ఉందని, విక్లీ పాజిటివిటీ రేటు 4.53శాతం ఉందని చెప్పింది. గత 24గంటల్లో 4,26,102 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 87.37 కోట్ల టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. టీకా డ్రైవ్‌లో 202.5కోట్ల డోసులు వేసినట్లు వివరించింది.