బురద మాయమైన రోడ్డుతో కాలనీవాసులకు ఇబ్బందులు

బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : మండల కేంద్రంలోని భీమన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వాహనదారుడు గుంతలు ఉన్నవి గమనించకుండా కింద పడిపోవడం తో ఇంటికి తిరిగి ముఖం పడుతున్నారు రోడ్లపైనే మురికి నీరు చెత్తాచెదారం ఉండడంతో దోమలు ఈగలు మురికిపైనా చేరడంతో వ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు అధికారులు ఈ రోడ్డు గుండా రావడమే మానేశారని ఇకనైనా పంచాయతీ సిబ్బంది మా సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు