బూరుగడ్డ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం

మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో  కార్తీక మాసం సందర్భంగా  శ్రీ నల్లకట్ట సంతాన కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే జోనల్ కమిటీ మెంబర్  యరగాని నాగన్న గౌడ్, గ్రామ సర్పంచ్ సలీమా రంజాన్, దేవాలయ కమిటీ చైర్మన్ చిమటచిన్న సైదులు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం  దేవాలయ పరిసర ప్రాంతాల ప్రజల సహాయ సహకారాలతో అన్నదానం కార్యక్రమం, దేవాలయ అభివృద్ధి జరగటం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో  బ్రహ్మశ్రీ రవీంద్ర చార్యులు, యరగాని భిక్షం, నాగలింగం, దీవెన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.