బెంగళూరులోను వాడిపోయిన కమలం

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోను కమలం తన ప్రభావం చూపించలేకపోయింది. గత మొత్తం 28 స్థానాల్లో 17 స్థానాల్లో విజయం సాధించిన భాజపా ఈ సారి ఆ స్థాయి విజయం సాధించలేకపోయింది. నగరంలో మోడీ నిర్వహించిన ప్రచారం నగర ఓటర్లను అకర్షించలేకపోయింది. గత సంవత్సరం నగరంలో ఏర్పడిన ‘చెత్త’ సమస్య భాజపా పాలనపై ప్రజల్లో అగ్రహం నెలకొంది. నెలల బాటు చెత్తను తరలించకపోవడంతో నగరంలో ఎక్కడచూసినా చెత్తదిబ్బలతో దుర్గందం ఏర్పడింది. నగర యువతను అకర్షించేందుకు భాజపా చివర్లో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పబ్‌లు, ఫలహారశాలల మూసివేత సమయాన్ని రాత్రి 11.30 నుంచి 1 గంటకు పెంచాలన్న హామీకి కూడా నగరవాసులు స్పందించలేదు.