బెంగాల్లో బిజెపి కార్యవర్గ సమావేశాలు


హోమంత్రి అమిత్‌షాతో సువేందు అధికారి భేటీ
కరోనా టీకాల పంపిణీ తరవాత సిఎఎ అమలు
అమిత్షా వెల్లడిరచాడన్న సువేందు అధికారి
న్యూఢల్లీి,అగస్టు2(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోమారు తెరపైకి తీసుకొచ్చారు. కోవిడ్‌`19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడిరచారు. పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లో సమావేశమైన సందర్భంగా హోంమంత్రి షా ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ కార్యవర్గ సమస్యలపై చర్చించేందుకు ఇరువురు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం మాట్లాడిన సువేందు అధికారి సీఏఏ అంశాన్ని తెలిపారు. ’కోవిడ్‌`19 మూడో డోసు పంపిణీ పూర్తవగానే దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న సీఏఏ అమలు చేస్తామని అమిత్‌ షా చెప్పారని పేర్కొన్నారు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బస్టర్‌ డోసుల పంపిణీని ప్రారంభించింది కేంద్రం. అది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. మే నెలలో పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురిలో నిర్వహించి సభలో సీఏఏపై మాట్లాడారు అమిత్‌ షా. సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర మంత్రి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అప్గానిస్థాన్‌ వంటి దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్‌, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్‌ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అయితే.. 2014, డిసెంబర్‌ 31లోపు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. 2019, డిసెంబర్‌లో ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మతం పేరుతో వివక్ష, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
భారత్‌లోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌, సీఏఏలు ఉన్నాయని పేర్కొన్నారు నిరసనకారులు. ఆ వాదనలను తోసిపుచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోడని హావిూ ఇచ్చారు.