బెయిల్ కోసం బిషప్ దరఖాస్తు
తిరువనంతపురం,సెప్టెంబర్18(జనంసాక్షి): కేరళ నన్పై అత్యాచారం కేసులో నిందితుడైన బిషప్ ప్రాంకో ములక్కల్ మంగళవారం కేరళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ సమర్పించారు. 2014, 2016 సంవత్సరాల్లో బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని కేరళ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నన్ చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోప్ ప్రాన్సిస్ కు లేఖ రాయడంతోపాటు మిషనరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పదిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. కేరళ పోలీసులు బిషప్ ను ప్రశ్నించారు. ఈ నేపథ్యలో బిషప్ తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంవిూద కేరళ నన్ పై బిషప్ జరిపిన అత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది.