బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ జగన్‌  ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన హోదాను పరిగణనంలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తన  పిటిషన్లో అభ్యర్థించారు. అరెస్టు కంటే ముందు సీబీఐ మూడు రోజులపాటు చేపట్టిన విచారణకు కూడా హాజరై దర్యాప్తునకు సహకరించానని బెయిల్‌ కోసం చేస్తే భవిష్యత్తులో  కూడా విచారణకు సహకరిస్తానని జగన్‌ తన పిటిషన్‌లో అభ్యర్థించారు.