బెల్జియం చేరుకున్న ప్రధాని మోడీ

3ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన నిమిత్తం బెల్జియం చేరుకున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. బెల్జియంలో వారం రోజుల క్రితం జరిగిన బాంబు దాడి నేపథ్యంలో మృతులకు ప్రధాని మోడీ నివాళ్లు ఆర్పించనున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ సమావేశం అనంతరం ప్రధాని మోడీ అమెరికా చేరుకుంటారు. అమెరికా పర్యటన ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటిస్తారు. ఐతే ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సౌదీ అరేబియా అధికారులు అనుమతి ఇవ్వలేదు. సెక్యూరిటీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.