బెల్ట్‌ షాపు నిర్వాహకుల అరెస్ట్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన 9 మందిని కల్లూరు మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్టేట్ర్‌ ఎదుట ప్రవేశపెడుతున్నట్లు ఎక్సైజ్‌ ఎస్సై అల్లూరి సీతారామరాజు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్‌ యమ్‌. డి.రహీం మాట్లాడుతూ అందరు సత్పవ్రర్తన కలిగి నడుచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ ఎస్సై అల్లూరి సీతారామరాజు మాట్లాడుతూ చెన్నూరు గ్రామంలో బెల్టుషాపుల ద్వారా వీరు మద్యం అమ్మేవారని తెలిపారు.ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సూచనల మేరకు సి.ఐ. ఆదేశాలతో ఇప్పుడు ఎన్నికల సమయంలో ముందస్తు గా బైండోవర్‌ చేయడం జరుగుతుంది అని తెలిపారు. వారికి మరల బెల్టుషాపులు నిర్వహించిన 50 వేల నుండి 1 లక్ష వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి విూరు ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టుషాపులు నిర్వహించరాదని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు,విల్సన్‌,ప్రేమకుమార్‌ పాల్గొన్నారు