బేతంపూడి సొసైటీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
టేకులపల్లి, ఆగస్టు 15( జనం సాక్షి) : 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బేతంపూడి సొసైటీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ లక్కినేని సురేందర్ రావు మువ్వన్నెల జెండాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఈవో ప్రేమాచారి, బేతంపూడి సొసైటీ డైరెక్టర్లు ,సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.