బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి

ఖమ్మం, (మార్చి 27):  ఖమ్మం జిల్లా దుమ్మగూడెం మండలం నర్సాపురం వద్ద బైక్‌ను కారు  ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు.