బైక్ ఢీకొని గొర్రెల కాపరి మృతి

నాగర్ కర్నూల్ రూరల్:జులై 12(జనంసాక్షి)

 

నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మంతటి గ్రామం అయిన కత్తి.రాములు గొర్రెలను కాస్తుండగా రోడ్డు మీద నిలిచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి బైకు ఢీకొనడంతో కత్తి రాములు తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు,నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కి తరలించి పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది.నాగర్ కర్నూల్ ఎస్సై విజయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు