బొలెరో వాహనం బోల్తా: చేపల వ్యాపారి మృతి

శ్రీకాకుళం,మార్చి19(జ‌నంసాక్షి): కవిటి మండలం కొజ్జిరియా కూడలి సవిూపంలో బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై పారినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం వేకువజామున తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒడిశాకు చేపల లోడ్‌తో బొలెరో వాహనం వెళ్తోంది. అతివేగం కారణంగా కొజ్జిరియా కూడలి సవిూపంలోకి రాగానే వాహనం డివైడర్‌ను ఢీకొంది. దీంతో వాహనం బోల్తా పడి అందులో ఉన్న వాహన యజమాని తోడాల దేవుడు(33) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం యల్లయ్యపేట గ్రామ వాసిగా గుర్తించినట్లు పోలీసులు
తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.