బోడుప్పల్ కౌన్సిల్ లో పలు అంశాలు ఆమోదం

మేడిపల్లి – జనంసాక్షి
బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన ఆగస్టు నెల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీసీ రోడ్ల పునరుద్ధరణకు 20 లక్షలు, డంపింగ్ యార్డు నుండి జవహర్ నగర్ కు చెత్త తరలించుట కోసం 50 లక్షలు, హరితహారం మొక్కలకు కర్రలు నాటుటకు 5 లక్షలు కేటాయించారు. మల వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించుట కోసం ప్రభుత్వ సూచనలు అమలు చేసేందుకు ఆమోదించారు. నాలా పూడిక తీయుటకు 2 లక్షలు కేటాయించారు. లక్ష్మీనగర్ ఓవర్ హెడ్ ట్యాంక్ శిథిలావస్థలో ఉన్నందున కూల్చివేయుటకు 3.5 లక్షలు కేటాయించారు. ఇతర సాధారణ అంశాలతో ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, కమీషనర్, వివిధ శాఖల అధికారులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.