బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు జులై21(జనంసాక్షి)
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు, బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
గురువారం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్, ఇస్నాపూర్ గ్రామాలలో నిర్వహించిన గ్రామ దేవతల బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా సన్మానించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Attachments area