బ్యాంకు తరలింపు వద్దని మహిళల నిరసన

మద్దూర్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలోని ఎన్‌బీఐ బ్యాంకును తరలించ వద్దని 500 మంది మహిళలు గురువారం
బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా ఏడు గ్రామాలకు సేవలందిస్తున్న బ్యాంకును నష్టాల పేరిట దూల్‌మిట్ట నుంచి తరలించేందుకు అధికారులు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు.