బ్లాక్‌మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది: కేజ్రీ

ఢిల్లీ: బ్లాక్‌మనీని స్వీస్‌బ్యాంకు తరలించేందుకు కేంద్రప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారుజ కేంద్రం వద్ద నల్ల ధనానికి సంబంధించిన జాబిత ఉన్న ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాన అనుచరుడు అనుటాండన్‌ స్వీస్‌బ్యాంక్‌లో రూ.125 కోట్లు నల్లధనం ఉందని ఆయన పేర్కొన్నారు. 700 మంది భారతీయులకు సంబంధించిన స్వీస్‌బ్యాంకులు నల్లధనం ఉందని ఆయన పేర్కొన్నారు. 700 మంది భారతీయులకు సంబంధించిన స్వీస్‌బ్యాంకులో నల్లధనం ఉందని ఆయన చెప్పారు. ఈ లీస్టు కాంగ్రెస్‌  సీనియర్‌ నేత తనకు అందించినట్లు ఆయన వివరించారు. ముఖేష్‌, అనిల్‌ అంబానీలకు స్వీస్‌బ్యాంకులో చేరో రూ.100 కోట్లు పెట్టారన్నారు. మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ కంపీని రూ.2100 కోట్లు, రిలయన్స్‌ కంపెననీరూ.500 కోట్లు, నరేష్‌గోయల్‌ రూ. 80 కోట్లు, డాబర్‌ గ్రూప్‌ రూ.25 కోట్లు నల్లధనం ఉన్నట్లు ఆయన బయట పెట్టారు.  జెనీవాలోని హెచ్‌బీసీ సహకారంతోనే నల్లధనాన్ని స్వీస్‌ బ్యాంకు తరలిస్తున్నారని కేజ్రీ తెలియజేశారు. హెచ్‌బీసీలో భారతీయులకు సంబంధించిన నల్ల ధనం ఆరువేల కోట్లు రూపాయలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.