భవనం పైనుంచి దూకి వ్యక్తి మృతి

అచ్చంపేట: అచ్చంపేటలో సోమవారం ఉదయం భవనంపై నుంచి దూకి ఒక వ్యక్తి మృతి చెందాడు. బాలానగర్‌ మండలం గుండేడు గ్రామానికి చెందిన అంజయ్య శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లి తిరుగు ప్రయాణంలో సహచరులతో కలిసి అచ్చంపేట బస్టాండులో పడుకున్నాడు. ఉదయం నిద్రలేచి బస్టాండు వెనక ఉన్న ఒక భవనం పైకి ఎక్కి కిందికి దూకాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉందని, నాలుగు రోజుల నుంచి తాగకపోయేసరికి మతి స్థిమితం తప్పి అలా చేసివుంటాడని సహచరులు తెలిపారు.