భవన నిర్మాణ, ఆటో,కారు కార్మికులకు అడ్డాలు కేటాయించాలి.
జహీరాబాద్ జులై 23 (జనంసాక్షి)భవన నిర్మాణ, ఆటో,కారు కార్మికులకు అడ్డాలు కేటాయించాలి అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు,కారు డ్రైవర్స్(ట్యాక్సీ) కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్న వారికి కనీస సౌకర్యాలైన అడ్డా కూడా కేటాయించలేని పరిస్థితి జహీరాబాద్ నియోజకవర్గంలో నెలకొందని వారందరికీ అడ్డా కేటాయించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వీరిపై అధికారుల వేధింపులు, షాపు ఓనర్స్ వేధింపులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా సిఐటియు ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, నాయకులు వీరయ్య గౌడ్, శ్రీకాంత్, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.