భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్లు ఇవ్వాలి…
తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కోటంరాజు
కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / తెలంగాణ రాష్ట్రంలోని బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం మోటార్ సైకిల్లు ఇవ్వాలని సిఐటియు అనుబంధ తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ ఆదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు అన్నారు.కేసముద్రంలోని హరిహర గార్డెన్స్ లో భవన నిర్మాణ కార్మికుల మండల నాలుగవ మహాసభ గురువారం ముల్క మురళి అధ్యక్షతన జరిగింది.ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు మాట్లాడుతూ అసెంబ్లీలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి భవనిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ ఇస్తానని ప్రకటించారని ఆ ప్రకారంగా వారికి మోటార్ సైకిల్ ఇవ్వాలని కోరారు. సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకున్న 55 సంవత్సరాల దాటిన కార్మికులకు ఐదువేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే బోర్డులో కార్మికుడు ఒకసారి పేరు నమోదు చేసుకుంటే ఎప్పటికీ ఉండే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం బిల్డింగ్ నిర్మాణరంగం అన్నారు.ఈ రంగంలో 54 రకాల కార్మికులు పనిచేస్తున్నారని సుమారు 25 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్మికుల నుండి బిల్డింగ్ వర్క్స్ బోర్డ్ పరిధిలో 35 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర మొలుగుతూ నిల్వలు ఉన్నాయన్నారు. కార్మికులు కార్డు రెన్యువల్ చేసుకోలేదని పేరుతో కార్మికులకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం సరైన సమయంలో వారికి కేటాయించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కార్మికులు సంఘంలో సభ్యులుగా చేరి కార్మిక శాఖ ద్వారా కార్డులు పొందాలని కార్డు వచ్చిన వారికి ప్రభుత్వం నుండి రావాల్సినవి రాబట్టుకోవడానికి సిఐటియు అండగా ఉంటుందని కార్మికులకు భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై మహబూబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలను నిర్వహించాలని సంఘం భావించిందని ఆ మహాసభలను విజయవంతం చేయడం కోసం ప్రతి కార్మికుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ. సదస్సుకు అతిథిగా తోరూర్ ఏఎల్ఓ సుమతి మేడం గారు హాజరై వారు మాట్లాడుతూ బిల్డింగ్ కార్మికులందరూ కార్డ్స్ తీసుకోవాలని తీసుకున్నవారు తప్పనిసరి రెన్యువల్ చేసుకోవాలని కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ మహాసభలు సిఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు అధ్యక్షుడు కుంట ఉపేందర్ భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తాడబోయిన శ్రీశైలం, సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు, జిల్లా నాయకులు గారె కోటేశ్వరరావు, బానోత్ శంకర్, కుమ్మరి కుంట్ల నాగన్న, మండల నాయకులు ఏదునూరి శ్రీనివాస్, గుంజపడుగు శ్రీనివాస్, ముల్క వెంకటేశ్వర్లు, రవి, రామ్మూర్తి, మహేందర్, వీరస్వామి దుంపల రాజయ్య,ఎస్కే పాష,లు 18 గ్రామాల నుండి భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
Attachments area
|