భాజపా దేశాన్ని అదోగతిపాలుచేసింది

` అన్నిరంగాల్లోనూ బీజేపీ వైఫల్యం
` సబ్‌ కా సాథ్‌ అంటూ టోపీ పెట్టారు
` నల్లధనం అరికట్టడంలోనూ విఫలం
` దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయేలా చేశారు
` ఆదానీ ఆస్తులను పెంచడంలో మాత్రం విజయం
` అసెంబ్లీ వేదికగా బిజెపిని చెండాడిని హరీశ్‌
` అభివృద్ది కళ్లకు కనబడడం లేదా?
` అన్ని రంగాల్లో ఆదర్శంగా రాష్ట్రం
` ప్రతి ఒక్కరి అభివృద్దిని కాంక్షించేలా పథకాలు
` ఒక్క మంచిపని కూడా ప్రతిపక్షాలు కనబడ లేదా
` బడ్జెట్‌లో సింహభాగం పేదలు,బడుగులకే కేటాయింపు
` యధావిధిగా డబుల్‌ ఇళ్ల పథకం
` ఉస్మానియాను నిర్మించి తీరుతాం
` రాజకీయాలు మాకో టాస్క్‌
` లక్ష్యం కోసం పట్టుదలతో పనిచేస్తాం
` మానవీయ కోణంలో పనులు చేపడతాం
` మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీరు ఇచ్చాం
` హర్‌ఘర్‌ జల్‌ అన్న కేంద్రం పట్టించుకోవడం లేదు
` అసెంబ్లీలో పలు అంశాలను వివరించిన ఆర్థిక మంత్రి
హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఘోరంగా విఫలమైందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ ఒక్క రంగంలోనూ పురోగతి లేదని, ఇచ్చిన హావిూలను బుట్టదాఖలు చేశారని, విభజన హావిూలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. శాసనసభలోబడ్జెట్‌కు సమాధానంగా మాట్లాడిన సందర్భంగా హరీశ్‌రావు బీజేపీని దుయ్యబట్టారు. గతంలో బడ్జెట్లను ప్రవేశపెట్టేటప్పుడు ఒక దశ దిశ ఉండేది. ఆర్థిక సర్వేలకు దగ్గరగా కేంద్ర బడ్జెట్‌ ఉండేదన్నారు. దానికి తగినట్టు దేశ ప్రగతి కూడా ఉండేదన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో బడ్జెట్‌ లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మోదీ మొదటి బడ్జెట్‌ లో చెప్పిన థీమ్‌ సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌. కానీ ఆ ఏడాదంతా మాబ్‌ లించింగ్‌లు జరిగాయి. రెండో బడ్జెట్‌ లో నల్లధనాన్ని అరికడుతాం అని చెప్పారు. కానీ మరుసటి సంవత్సరమే పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థ చితికి పోయిందని గుర్తు చేశారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయని మంత్రి తెలిపారు. నల్లధనం తెచ్చి, ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ చెబితే.. ప్రజలు జన్‌ధన్‌ ఖాతాలు తెరిచి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్క పైసా డిపాజిట్‌ కాలేదన్నారు. మూడో బడ్జెట్‌ లో రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ రైతులను పట్టించుకోకుండా, 2020లో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారని తెలిపారు. 750 మంది రైతులు ఉసురు పోసుకున్నారని గుర్తు చేశారు. ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇవ్వలేదు. అర్హులైన వాందరికి ఇండ్లు అని ప్రకటించారు.. అది అడ్రస్‌ లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు. నదుల అనుసంధానం కాలేదు. అంతే కాదు.. బీజేపీ విజయాలు కూడా కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్‌ అయింది. ఫుడ్‌ సెక్యూరిటీని నాశనం చేయడంలో, రూ. 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో, సిలిండర్‌ ధరలు పెంచడంలో, పసి పిల్లలు తాగే పాలవిూద కూడా జీఎస్టీ విధించడంలో,ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడం లో, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయ డంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ ప్రభుత్వం సక్సెస్‌ అయిందని హరీశ్‌రావు చురకలంటించారు. బిజెపి పాలకుల ఇది అమృత్‌ కాలమైతే.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకంతో దేశం ముందు ఓ మోడల్‌ను పెట్టింది. దీన్ని చూసి కూడా మిగతా రాష్టాల్రు ఎందుకు చేయలేకుపోతున్నయ్‌. నిధులు లేకనా? నీళ్లు లేకనా? అసలు విషయం ప్రజల పట్ల ప్రేమ, మమకారం లేకపోవడం ఏ రాష్ట్రంలో తెలంగాణ తరహాలో పథకాలు అమలుకావడం లేదన్నారు.
రాజకీయాలు మాకో టాస్క్‌
దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలంటే ఒక గేమ్‌. కానీ, సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి పాలిటిక్స్‌ ఒక టాస్క్‌. ఏ లక్ష్యాన్ని అయినా పట్టుదలతో దాన్ని పూర్తి చేసేలా ప్రజల కోణంలో, మానవీయ కోణంలో పని చేసే ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని మంత్రి హరీష్‌ రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ సమాధానంలో మాట్లాడుతూ… మిషన్‌ భగీరథలో 1.50లక్షల కిలోవిూటర్ల పైప్‌లైన్‌, 37వేల వాటర్‌ ట్యాంక్‌లు, 1804 సర్వీస్‌ రిజర్వాయర్‌లు, 123 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ పాంట్లు, 77 ఇంటెక్‌ వెల్స్‌ వీటన్నింటిని మూడునాలుగేళ్లలో పూర్తి చేయడం ఓ భగీరథ యత్నం. సీఎం కేసీఆర్‌ ఒక టాస్క్‌గా తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది. ఇది మాకు మిగతా పార్టీలకు ఉన్న తేడా అదేనని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పరిపాలన, దేశంలో మోదీ నాయకత్వంలో బీజేపీ పరిపాలన ఒకేసారి ప్రారంభమయ్యాయి. అధికారంలోకి ఆరేడేళ్లలోనే 2020 నాటికి మిషన్‌ భగీరథను పూర్తి చేశాం. కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌ 2022లో మిషన్‌ భగీరథలో ఇంటింటికి మంచినీరు ఇచ్చినందుకు రాష్టాన్రికి అవార్డు ఇచ్చింది. మన పథకాన్ని ’హర్‌ఘర్‌కో జల్‌’ పేరుతో కాపీ కొట్టారు కానీ.. స్పీడ్‌గా పనులు చేయడం లేదు. కేసీఆర్‌ తెచ్చిన పథకాన్ని తీసుకువస్తే కేంద్రం దీన్ని దేశమంతా అమలు చేయడం రాష్టాన్రికి గర్వకారణం. దేశ ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవాళ 49శాతం మందికి మాత్రమే అందుతుంది. స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు అమృత్‌కాలమని గొప్ప చెప్పుకుంటున్నారు. ఇంకా 51శాతం మంది ప్రజలు కనీస సౌకర్యమైన తాగునీటికి దూరంగా ఉన్నారు. తెలంగాణ సక్సెన్‌ను కలుపుకొని కేవలం 49శాతం మందికి మాత్రమే స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుంది. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూ.44,933.66 కోట్లఅంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. కానీ, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు చేసిన వాస్తవమైన వ్యయం రూ.36,900 కోట్లు మాత్రమే. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనరలో ఖచ్చితమైన ప్రణాళికతో పారదర్శకంగా ఆధునిక పద్ధతులను వినియోగించి నిర్ణీత సమయంలో పథకాన్ని పూర్తి చేయడం వల్ల రూ.8,033.66 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఆదా చేయగలిగింది’ అని హరీశ్‌రావు వివరించారు. తెలంగాణలో మాత్రం 100శాతం డ్రిరకింగ్‌ వాటర్‌ సప్లై అవుతోందని చెప్పారు. రూ. 36,900 కోట్ల వ్యయంతో చేపట్టిన  మిషన్‌ భగీరథ పనులను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేయడం ద్వారా..రూ. 8033 కోట్లు ఆదా చేసినట్లు హరీష్‌ వెల్లడిరచారు. రాష్ట్రంలో వేసవి కాలంలోనూ చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని మంత్రి హరీష్‌ రావు అన్నారు. 2014 ముందు ఎండిన చెరువులు ఇప్పుడు జలకళ సంతరించుకోవడాన్ని ప్రస్తావించారు. సమైక్య రాష్ట్రంలో చెరువులు శిథిలమయ్యాయని.. అందుకే మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్దరించామన్నారు. మిషన్‌ కాకతీయ వల్ల భూగర్భజలాలు ఉబికి వస్తున్నా యని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా కట్టని విధంగా కేవలం మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు దేశ,  విదేశాల నుంచి వస్తున్నారని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వందల సంఖ్యలో కేసులు వేశారని.. అయినా..చిత్త శుద్ధితో కాళేశ్వరాన్ని నిర్మించినట్ల వెల్లడిరచారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు 63 శాతం పూర్తయ్యాయన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. నిర్ణీత కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల అనేక కోట్లు ఆదా చేశామని అన్నారు.
తెలంగాణలో అభివృద్ది కళ్లకు కనపడేలా..దేశం అచ్చెరువొందేలా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అలాగే దేశానికి ఆదర్శంగా పథకాలు సాగుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం, సవిూకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా.. సుదీర్ఘంగా సమాధానం ఇస్తూ..ప్రతిపక్ష సభ్యుల తీరుపైనా, కేంద్రం తీరుపైనా మండిపడ్డారు. తెలంగాణ అభివృద్దిని ఓర్వలేని  విధంగా బిజెపి ప్రవర్తిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంది. కంటివెలుగు, రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వం మంచిపని చేసిందని ఒక్క మాటచెప్పలేదు. వారి మాటలు ఎలా ఉన్నాయంటే.. నిండుపున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి.. ఆ చందమామ విూద ఉన్న మచ్చలు వెతికే ప్రయత్నం చేసినట్టుందని అన్నారు. వెనుకటికి ఏం వంక అంటే.. ఏలువంక అన్న చందంగా బీజేపీ, కాంగ్రెస్‌ తీరుంది. బడ్జెట్‌లో సింహభాగం నిధులు పేదలు, బడు బలహీన వర్గాల కోసం నిధులు కేటాయించామని, ప్రతిపక్షాల మాటలు బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, అగ్రవర్ణాల పేదలకు ఏమి చేయొద్దని కాంగ్రెస్‌, బీజేపీ సభ్యుల మాటల్లో తెలుస్తుందని అన్నారు.బడ్జెట్‌లో ముసలవ్వలకు రక్షణ ఉంది. పసిపిల్లలకు పోషణ, బడి పిల్లలకు శిక్షణ, ఉన్నత విద్యకు ఉపకారం, యువత ఉద్యోగ కల్పన, ఆరిపోని కరెంటు వెలుగులు ఉన్నాయి. నదీ జలాలను ఎత్తిపోసే విజయాలున్నాయి. మత్తడి దుంకుతున్న చెరువుల తళతళలు, చెరువు లో చేపపిల్లల మిలమిలలు, జలరాశుల గలగలలు, ధాన్యరాశుల కళకళలున్నాయి. రైతుల ముఖంపై విరబూస్తున్న చిరునవ్వులు, గొర్రెల మందల అరుపుల, గొళ్లకురుమల కండ్లలో మెరుపులు, నేతన్నకు భరోసా ఉన్నది, గీతన్నకు కులాస ఉన్నది. దళితబంధు ఇచ్చే దిలాసా, ఆకుపచ్చని అడవులు, మళ్లీ ఊపిరిపోసుకున్న పక్షి జాతులున్నాయ్‌, కాలుష్యంపై కదనం ఉంది.. పర్యావరణ సమతుల్యం ఉన్నది.. పేదిండి ఆడపిల్లల పెళ్లిపందిళ్లున్నాయి.. వారి తల్లిదండ్రుల కండ్లల్లో ఆనంద భాష్పాలున్నాయి. కంటి వెలుగు కాంతి ఉంది.. ప్రతి హృదయం ఉంది. కొత్త హాస్పిటల్స్‌ ఉన్నాయి.. జిల్లాకో మెడికల్‌ కాలేజీలు ఉంది. పెరిగిన బెడ్లు ఉన్నయ్‌.. చికిత్స మార్గం ఉంది.. ఆరోగ్య భాగ్యం.. సబ్బండ వర్ణాల సంక్షేమం ఉంది. సకలజనుల సౌభాగ్యం, సవిూకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉంది. ఇవి ప్రతిపక్షాలకు కనపడకపోతే మేం ఏం చేయాలని ఘాటుగానే ప్రశ్నించారు. గతంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే ట్యాంక్‌ బండ్‌ దగ్గర అంబేద్కర్‌ విగ్రహం నుంచే.. తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచో ఖాళీ బిందెల ప్రదర్శనలతో అసెంబ్లీకి వచ్చేవాళ్లం. అసెంబ్లీలో మొదటిరోజు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి విూద విపక్షాలన్నీ వాయిదా తీర్మానం ఇచ్చేవి. మొదటి వాయిదా తీర్మానం కరెంటు కోతలు, తాగునీటి బాధలపై ఉండేవి. బడ్జెట్‌ సమావేశాల్లో మంచినీటి కొరత గురించి మాట్లాడకుండా సభ జరిగిన సమావేశమే లేదు. మిషన్‌ భగీరథ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రోజైనా భట్టీ విక్రమార్క గానీ, ఇతర విపక్ష సభ్యులు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీర్మానాలు ఇచ్చారా? వాగ్యుద్దాలు ఉన్నాయా? ఖాళీ కుండల ప్రదర్శన ఉందా? ఇవన్నీ లేవంటే ప్రతిపక్షాలు కూడా రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదని ఒప్పుకున్నట్టే కదా? ఇంత మంచి పని జరిగితే ఒక్కనాడైన మంచి అని చెబుతున్నారా? అంటూ ధ్వజమెత్తారు. గతంలో ఎమ్మెల్యేలుగా శాసనసభ నియోజకవర్గంలో పర్యటించాలంటే కాంగ్రెస్‌ మంత్రులు, పార్టీ నేతలు గ్రామాలకు రావాలంటే అయితే ముందే పోలీస్‌ బండన్నా రావాలే.. లేదంటే బోరుబండి వచ్చినంక ఎమ్మెల్యేనో.. మంత్రి వస్తుండే. పోలీసు బండి ఖాళీ బిందెలన్నీ పక్కకు జరిపితే మెల్లగా మంత్రిగారు వస్తుండే. లేదంటే బోరుబండి వచ్చి ఒకటో రెండు బోర్లు వేస్తే .. ఎమ్మెల్యేనో, మంత్రి వస్తుండే. ఇవాళ ఖాళీ బిందెల ప్రదర్శన ఉందా అని నిలదీసారు. ఆ రోజుల్లో బిందెడు నీళ్ల కోసం మైళ్లదూరం నడిపోయిన యాతన ఉండేది. అక్కాచెల్ళెళ్లు బోరింగ్‌లు కొట్టీకొట్టి భుజాలు నొప్పి పెట్టిన రోజులుండేవి. నారాయణఖేడ్‌లో ’హదునూరకు ఎద్దునివ్వదు.. బోరంచకు పిల్లనివ్వద్దు’ సామెత ఉండేది. హద్దునూరకు ఎద్దునిస్తే నీళ్ల దొరక్క ఆగమైతదని.. ఎద్దనీవ్వద్దని అందురు. బోరంచలో నీళ్లు కావాలంటే నాలుగు కిలోవిూటర్ల దూరంలో పోయి బిందెల్లో మోసుకువచ్చే పరిస్థితి ఉండేది. గతంలో నులకమంచంలో పసిపిల్లలను నిలబెట్టి స్నానం చేయించి.. మంచం కింద తాంబాలం పెట్టి తిరిగి వాడుకునే దుస్థితి నాడు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండేది. ఇవాళ వీళ్లంతా మాకు సుద్దులు, బుద్ధులు చెబుతున్నరు’ అంటూ హరీశ్‌రావు విమర్శించారు.
యధావిధిగా డబుల్‌ ఇళ్ల పథకం
రాష్ట్రంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకం యథావిధిగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో స్పష్టం చేశారు. బడ్జెట్‌పై సమాధానం ఇచ్చన  సందర్భంగా విపక్ష సభ్యులు అక్బరుద్దీన్‌ ఓవైసీ, భట్టి విక్రమార్క, రఘునందన్‌ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు డీఏల్లో మొన్న ఒక డీఏ ఇచ్చామని తెలిపారు. మరో రెండు డీఏలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. న్యూ ఉస్మానియా బిల్డింగ్‌ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యునాని హాస్పిటల్‌ను కూడా అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు. పన్నులు వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎలాంటి కొత్త పన్నులు వేయం. సొంత ఆదాయ వనరులపై దృష్టి సారించాం అని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ సమస్యలు లేకపోతే.. పవర్‌ హాలిడేలు, క్రాప్‌ హాలిడేలు ఎందుకు ప్రకటించారు. ఇందిరా పార్క్‌ వద్ద పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నాలు చేయాల్సి వచ్చిందని హరీశ్‌రావు భట్టిని అడిగారు. హైదరాబాద్‌ నగరానికి కృష్ణా జలాలను తీసుకొస్తే.. ఇదే సభలో దివంగత ఎమ్మెల్యే పీజేఆర్‌ ఎందుకు నీళ్ల గురించి ప్రశ్నించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. రాష్టాన్రికి సంబంధించిన స్పోర్ట్స్‌ పాలసీ రెడీగా ఉంది. ఆ పాలసీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. క్రీడల విషయంలో ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తుందన్నారు. రెండు, మూడు నెలల క్రితం డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉన్న మధ్యప్రదేశ్‌లో ఎరువులు దొరక్క తొక్కిసలాట జరిగి ఆరుగురు రైతులు మరణించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. అన్ని మండలాల్లో గోడౌన్లు కట్టి.. బఫర్‌ స్టాక్‌ ఉంచి రైతులకు ఎరువులు అందిస్తున్నాం. ప్రభుత్వం యొక్క ముందు చూపు, సీఎం కేసీఆర్‌ దార్శనికత వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.