భాజపా సైనికులు అంతా సిద్ధంగా ఉండండి

ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు
*జిల్లా  పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి.
మిర్యాలగూడ, జనం సాక్షి.
 మునుగోడు ఎన్నికల అనంతరం  రాష్ట్రంలో రోజురోజుకు ఎన్నికల వాతావరణ సందడి  స్పష్టంగా కనిపిస్తుందని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం   టిఎన్ఆర్ గార్డెన్స్ లో పట్టణ పార్టీ అధ్యక్షుడు దొండపాటి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన మిర్యాలగూడ అసెంబ్లీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రభావం రోజురోజుకు తగ్గుతుందని, ఈ కారణంగా తెరాసలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని అన్నారు.మిర్యాలగూడ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బాణావత్ రతన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ పార్టీని గ్రామీణ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ అన్ని గ్రామ వివిధ కమిటీలు పూర్తి స్థాయిలో నియమించాలని అన్ని అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసారు. ఈ సమావేశం లో ముఖ్య  అతిథులుగా  అసెంబ్లీ ప్రభారి  లచ్చిరెడ్డి రాష్ట్ర నాయకులు.సాదినేని శ్రీనివాస రావు,ఎడ్ల రమేష్, ,సత్య ప్రసాద్, బంటు సైదులు, చెలమల సీతారాం రెడ్డి,అశోక్ రెడ్డి, బంటు గిరి, మండల పార్టీ అధ్యక్షులు పులి విద్యా సాగర్,జానకిరామ్ రెడ్డి, సాంబ మూర్తి, కొండలు, నర్సింహ, శ్రీకాంత్ రెడ్డి, భరత్,పెడమం వెంకన్న మరియు శక్తి కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.