భారాసకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

హైదరాబాద్‌(జనంసాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భారాసకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల హావిూతో పేదలకు మేలు జరుగుతుందని.. అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి తెలిపారు.ఆదివారం ఉదయమే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో కసిరెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ఛైర్మన్‌ బాలాజీ సింగ్‌ కూడా భారాసకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడిరచారు. ఇదిలా ఉండగా.. మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.