భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

xzb0hp1qభారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 245 పాయింట్ల నష్టంతో 28,800 దగ్గర ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 8,750 దగ్గర క్లోజయ్యింది. సెసా స్టెర్లైట్, ఓఎన్జీసీ, టాటా పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ తదితర షేర్లు లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్, హెచ్.సి.ఎల్ టెక్, మహింద్రా అండ్ మహింద్రా, సన్ ఫార్మా, టాటా మోటార్స్ వంటి కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.62.42 గా ఉంది.