భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో పత్తి పంట నష్టం.

జనంసాక్షి న్యూస్ :
రాష్ట్ర వ్యాప్తంగా నాల్గు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో నెరడిగొండ మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతు కడం వాగు వరదనీటి తాకిడికి వాగు సమీపంలోని ప్రాంతాలు కుఫ్టీ కుమారి తర్నం వాగ్దరి మాదాపూర్ వెంకటాపూర్ కుంటాల తోపాటు ఆయా లోతట్టు ప్రాంత గ్రామాల్లోని పంట చెను పొలాల్లో వరదనీరు చేరి జలమయమయ్యాయి. వేలాది ఎకరాల పత్తి సోయా కంది పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని పెట్టిన పంటకు పెట్టుబడి కూడా వచ్చేటట్లు కనబడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగాసోమవారం రోజున మండల వ్యవసాయ శాఖ అధికారి బిర్రు భాస్కర్ కుఫ్టీ గ్రామంలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు తగ్గాక చేలాల్లో ఉన్న నీరునిల్వ ఉండకుండా చూసి ఎరువులు వేసుకోవాలని రైతులకు సూచించారు.ఇట్టి వర్షానికి జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు