భారీ వర్షాల వల్ల రోడ్లు గుంతలమయం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

అయిజ,జులై 13 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్న కారణంగా ఐజ పట్టణంలో ఆర్&బి రోడ్లమీద వర్షాపు నీరు భారీగా ఆగడం వల్ల వాహనాలకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది, అదేవిధంగా రోడ్లపై అనేక చోట్ల గుంతలు ఉండడం వల్ల వర్షాపు నీరు ఆ గుంతల్లో చేరడం వల్ల ప్రజలు తిరగడం వల్ల ఆ గుంతల్లో ప్రజలు పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని కనుక అధికారులు రోడ్లపై ఉన్నటువంటి వర్షాపు నీరును తొలగించాలని మరియు రోడ్లపై ఉన్నటువంటి గుంతలను పూడ్చివేయాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు
Attachments area