భివాండిలో భారీ అగ్నిప్రమాదం

ముంబయి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  మహారాష్ట్రలోని భివాండిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కల్హర్‌ ప్రాంతంలోని ఓ భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సవిూప ప్రాంతాల ప్రజలు ఇళ్లను వదిలి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.