భాజపా కోర్‌ కమిటీ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో నెటకొన్న  రాజకీయ సంక్షోభం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై  చర్చించేందుకు భాజపా కోర్‌ కమిటీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు నితిస్‌ గడ్కరి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో సదానందగౌడ్‌ స్థానంలో కార్ణటక సీఎంగా జగదీష్‌ షెట్టర్‌ను  మార్చే అంశంపై నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నారు.  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న షెట్టర్‌కు యడ్యూరప్ప వర్గం మద్దతు ఉంది. అలాగే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిని నియమించే అంశంపై కూడా పార్టీ చర్చించనుంది. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతలు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.