మండలంలో రెపరెపలాడిన మువ్వెన్నెల జెండా
శివ్వంపేట ఆగస్ట్ 15 జనంసాక్షి :
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా పంద్రాగస్టు వేడుకలు మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం ఘనంగా జరిగాయి. తహశీల్దార్ కార్యాలయం ముందు తహశీల్దార్ శ్రీనివాస్ చారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మువ్వెన్నేల జెండాను ఎగురవేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కో ఆపరేటివ్ బ్యాంక్ ముందు చైర్మన్ వెంకట్రామిరెడ్డి జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎంఆర్సీ కార్యాలయం ముందు ఎంఈఓ బుచ్ఛా నాయక్, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రవికాంత్ రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గోమారంలో సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, పెద్ద గొట్టిముక్కులలో సర్పంచ్ గొల్ల చంద్రకళ శ్రీశైలం, పిల్లుట్ల గ్రామంలో సర్పంచ్ పెద్దపులి రవి, బిజిలిపూర్ లో సర్పంచ్ చిట్యాల లక్ష్మీ, గూడూరులో సర్పంచ్ స్వరాజ్య లక్ష్మీ శ్రీనివాస్ గౌడ్, శబాష్ పల్లిలో సర్పంచ్ పార్వతి సత్యం, దంతాన్ పల్లిలో సర్పంచ్ కన్నారం దుర్గేశ్, చెన్నాపూర్ లో సర్పంచ్ భారతి బిక్షపతి జాతీయ జెండాలను ఎగురవేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్,కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా పంద్రాగస్టు వేడుకలు మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం ఘనంగా జరిగాయి. తహశీల్దార్ కార్యాలయం ముందు తహశీల్దార్ శ్రీనివాస్ చారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మువ్వెన్నేల జెండాను ఎగురవేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కో ఆపరేటివ్ బ్యాంక్ ముందు చైర్మన్ వెంకట్రామిరెడ్డి జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎంఆర్సీ కార్యాలయం ముందు ఎంఈఓ బుచ్ఛా నాయక్, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రవికాంత్ రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గోమారంలో సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, పెద్ద గొట్టిముక్కులలో సర్పంచ్ గొల్ల చంద్రకళ శ్రీశైలం, పిల్లుట్ల గ్రామంలో సర్పంచ్ పెద్దపులి రవి, బిజిలిపూర్ లో సర్పంచ్ చిట్యాల లక్ష్మీ, గూడూరులో సర్పంచ్ స్వరాజ్య లక్ష్మీ శ్రీనివాస్ గౌడ్, శబాష్ పల్లిలో సర్పంచ్ పార్వతి సత్యం, దంతాన్ పల్లిలో సర్పంచ్ కన్నారం దుర్గేశ్, చెన్నాపూర్ లో సర్పంచ్ భారతి బిక్షపతి జాతీయ జెండాలను ఎగురవేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్,కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
