మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఇల్లూరు నాగరాజు

 

పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బాదం శ్రీనివాసులు

మల్దకల్ జులై 17 (జనంసాక్షి) మల్దకల్ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ఆదివారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగాయి.మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఇల్లూరు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇల్లూరు గంగాధర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బాదాం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా గనేకల్ రామకృష్ణ, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా నరహరి ప్రవీణ్ ప్రధాన కార్యదర్శిగా మనసాని ప్రదీప్,ఆర్యవైశ్య మహిళ అధ్యక్షురాలుగా ఇల్లూరు పద్మజ, ప్రధాన కార్యదర్శిగా మనసాని జయలక్ష్మి లను ఎన్నుకున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మేడిశెట్టి బాలస్వామి సూచనల మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అభివృద్ధికి రెండవసారి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు మనసాని నాగరాజు,అవొపా అధ్యక్షులు నరహరి వెంకటేశ్వర్లు,యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇస్కాల నరేందర్, జిల్లా సభ్యులు అల్లంపల్లి వెంకటేష్ మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు,మహిళా సభ్యులు పాల్గొన్నారు