మండల టాపర్ కి అభినందనలు తెలియజేసిన గ్రామ సర్పంచ్, లక్ష్మీనారాయణ.

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 8 అక్టోబర్ 2022
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల పరిధిలోని కాంసానిపల్లి గ్రామానికి చెందిన మాగాని అపూర్వ మండల స్థాయిలో పదవ తరగతిలో టాపర్ గ నిలిచింది, అదేవిధంగా బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సాధించింది, అందుకుగాను గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు ఇచ్చినందుకు అభినందిస్తూ విద్యార్థినికి ప్రోత్సాహక బహుమతిగా 5116/-రూపాయలు,అందించడం జరిగింది. ముందు ముందు భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థినికి బహుమతి ఇచ్చినందుకుగాను సర్పంచ్ లక్ష్మీనారాయణకు గ్రామస్తులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Attachments area