కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

నెరడిగొండ ఆగస్టు18(జనంసాక్షి):
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలులో ఉంది.అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని,మహిళలకు రైతులకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.శుక్రవారం రోజున మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కల్యాణ లక్ష్మీ,సిఎం సహయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 40.మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ,సాది ముబారక్,సీఎంఆర్ పథకం ద్వారా మంజూరైన చెక్కులతో పాటు ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగా పేద ఆడపడుచుల పెళ్లి ఘనంగా చేసుకోవడానికి కల్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అన్నారు.తెలంగాణలో మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని అన్నారు.కేసీఆర్ పైన బీజేపీ నాయకులు లేనిపోని అబద్ధాలు ఆరోపణలు చవకబారిన మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపాటు మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్,ఎంపీపీ రాథోడ్ సజన్,మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల బోజన్న,తెరాస పార్టీ కన్వీనర్ శివారెడ్డి తహసీల్దార్ పవన్ చంద్ర,ఎంపీడీఓ అబ్దుల్ సమద్,ఎంఆర్ఐలు నాగోరావు,మిరబాయి వివిధ గ్రామ సర్పంచ్లు మాజీ జడ్పీటీసీలు పార్టి సీనియర్ నాయకులు ఎంపీటీసీలు మండల నాయకులు మహిళ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area