మండల సర్వసభ్య సమావేశం వాయిదా
ఝరా సంగం ఆగస్టు 19 (జనంసాక్షి) మండల సర్వసభ్య సమావేశం వాయిదా వేయడం జరిగిందని ఝరాసంగం ఎంపీడీవో సుజాత తెలిపారు. శుక్రవారం మండల సర్వ సభ్య సమావేశం ఉండడంతో మండల సర్వసభ్య సమావేశం సభ్యుల కోరం లేకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్టు సర్వసభ్య సమావేశంలో మండలంలోని ప్రజాప్రతినిధులు సర్వసభ్య సభ్యులు అధికారులు సర్పంచులు సమయానికి రావాలని కోరారు.