మండల స్థాయి కబడ్డీ పోటీల విజేతలకు బహుమతులు అందజేత

విద్యా కమిటీ చైర్మన్ సిద్ధి నరసింహులు

మల్దకల్ అక్టోబర్ 9 (జనంసాక్షి) మండల కేంద్రంలోని శ్రీ మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారము మండల స్థాయి కబడ్డీ పోటీలు, ట్రాక్టర్ రివర్స్ పోటీలు,సందురాళ్ల పోటీలు, నిర్వహించారు.ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సిద్ధి నరసింహులు అందజేశారు.మండల స్థాయి కబడ్డీ పోటీలకు మొదటి బహుమతి 8016 రెండో బహుమతి 5016, మూడో బహుమతి3016, సందు రాళ్ల పోటీల విజేతలకు మొదటి బహుమతి5016, రెండో బహుమతి3016, మూడో బహుమతి2016, ట్రాక్టర్ రివర్స్ విజేతలకు మొదటి బహుమతి10,016, రెండవ బహుమతి5016, మూడవ బహుమతి3016 అందజేశారు. మండలంలోని వాల్మీకి జయంతి సందర్భంగా మూడు పోటీలను నిర్వహించడం జరిగింది.ఈపోటీల విజేతలకు బహుమతులను విద్యా కమిటీ చైర్మన్ సిద్ది నర్సింలు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో వాల్మీకులు నర్సింలు,రాముడు, గోవిందు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ వ్యవస్థాపక శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.అనంతరం వాల్మీకి దేవాలయంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.