మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు…

ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం లైబ్రరీ మరియు కమ్యూనిటీ హాల్ స్థలం మంజూరు కొరకు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్ ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కరీంనగర్ క్యాంప్ ఆఫీసులో కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించిన,తదనంతరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతేమ్మ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సౌళ్ళ భీమయ్య టిఆర్ఎస్ మండలఅధ్యక్షుడు మొగిలి శేఖర్ టిఆర్ఎస్ నాయకులు సంగి శేఖర్ కౌన్సిలర్ బండారి అశోక్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పులి శెట్టి మల్లేశం ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చీపురుశెట్టి రాజేష్ ఆర్థిక కోశాధికారి కాసెట్టి రాంబాబు ఉపాధ్యక్షులు సోమిశెట్టి శివ సాయి స్తంభంకాడి మహేష్ సంయుక్త కార్యదర్శి ఒడ్నాల భూమేష్ సెక్రటరీ చుక్క రవి తదితర నాయకులు పాల్గొన్నారు.