మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి కి కలిసి సన్మానించిన నిజాంపేట్ నాయకులు
నారాయణఖేడ్ జులై (జనంసాక్షి)
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ గ్రామాన్ని మూడు మండలాలలోని వివిధ 16 గ్రామలతో కూడిన కొత్త మండలంగా నిజాంపేట్ ను ప్రకటించడపై అట్టి మండలంలో కలిసే నాయకులు అందరూ నేడు ఖేడ్ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తో కలిసి సిద్దిపేట యందు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు ని ఘనంగా సన్మానించడం జరిగింది.నిజాంపేట్ గ్రామము నియోజక వర్గంలోని పెద్ద గ్రామము కావున వారి యొక్క చిరకాల వాంఛ మండలం కోరిక తెరాస ప్రభుత్వం శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి , ఎంపీ బీబీ పాటిల్ , మంత్రివర్యులు హరీశ్ రావ్ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గర్లకు రుణపడి ఉంటామని నాయకులు తెలిపారు. వైస్ ఎంపీపీ సాయి రెడ్డి, నిజాంపేట సర్పంచ్ జగదీశ్వర చారి,నాగధర మాజీ సర్పంచ్ వెంకటేష్ సెట్,నగధర్ సర్పంచ్ మధుకర్, రామచందర్ తండా సర్పంచ్ మున్నా నాయక్, మోదలకుంట తాండ సర్పంచ్ గోవింద్, నాగధర ఎంపిటిసి గోపి నాయక్, మేగ్య నాయక్ తాండ సర్పంచ్ గంగారాం, ఉప సర్పంచ్ టీకారం, బాల్కమ్ చెల్క్ తండా సర్పంచ్ రూప్ సింగ్,ఎంపీటీసీ కిషన్ నాయక్,బాచేపల్లి PACS ఛైర్మెన్ సంగారెడ్డి,మాజీ సర్పంచ్ సంగయ్య,సంగారెడ్డి,కొత్తపల్లి మెంబెర్ సాయిలు, భూమేష్, దామార్చేరువు సంతోష్,ఇతర కార్యకర్తలు,అజయ్,కిష్టారెడ్డి నర్సింలు,రాజు,కిషన్,రాంసింగ్, రాజాక్,పాడు నాయక్,విత్తల్,నర్సింలు,రత్నం, తదితరులు ఉన్నారు.

Attachments area