మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

మహబూబ్ నగర్ ఆర్ సి ,అక్టోబర్ 11 ,(జనం సాక్షి) మహబూబ్ నగర్ నియోజకవర్గం దర్మాపూర్ , మరియు హన్వాడ మండలంలోని కొండగట్టు పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అన్నయ్య తో పాటు సుమారు వందమంది బీజేపీ ,టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.అలాగె దర్మాపూర్ ఎంపిటిసి సభ్యులు రవీందర్ రెడ్డి అధ్వర్యంలో వార్డు సభ్యుడు రఘురాములు తొ సహా 50 మంది కాంగ్రెస్ ,బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టిలో చేరారు . వీరికి మహబూబ్ నగర్ న్యూ టౌన్ లోని పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.