మంత్రి హరీష్ రావు ను కలిసిన ఆత్మ ఛైర్మన్ పెంటారెడ్డి
జహీరాబాద్ ఆగస్టు 7 (జనంసాక్షి) జహీరాబాద్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమించబడిన షెట్టప్ పెంటా రెడ్డి హైదరాబాద్ లోని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఆయన నివాసంలో స్థానిక శాసన సభ్యులు కొనింటి మానిక్ రావు అధ్యర్యములో కలిసి తన నియామకానికి సహరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్బంగా పెంటా రెడ్డి మాట్లాడుతూ తన వంతుగా రైతులకు మేలు జరగడానికి కృషి చేస్తానని పెంటా రెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో డి.సి.ఎం.ఎస్ చైర్మెన్ శివకుమార్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్,టి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు పాండు రంగ రెడ్డి,నామ రవికిరణ్,నియేజకవర్గ ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు తట్టు నారాయణ యాదవ్ లు పాల్గొన్నారు.