మఖ్తల్ అక్షర స్కూల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై నిషేధం పై అవగాహన ర్యాలీ

మక్తల్ పట్టణంలోని అక్షర హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై రాములు పాల్గొన్నారు ఈ ర్యాలీ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్సై రాములు మాట్లాడుతూ సమాజం చైతన్యపరచడంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసులు ప్రిన్సిపాల్ రమేష్ డైరెక్టర్ రాఘవేంద్రారెడ్డి ధర్మరాజు అంజయ్య ఆచారి జగదీష్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు