మట్టిలో మాణిక్యం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ , భాగ్యలక్ష్మీ .

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 9 అక్టోబర్ 2022.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట  నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రా నికి చెందిన డిప్యూటీ సర్పంచ్ దంతు పుల్లమ్మ, మల్లయ్య ఏకైక పుత్రిక భాగ్యలక్ష్మి అథ్లెటిక్స్ 800 మరియు 1500 మీటర్స్ ఆల్ ఇండియా, ఇంటర్, యూనివర్సిటీ, గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భాగ్యలక్ష్మిని సత్కరించడం జరిగింది .ఈ సందర్భంగా భాగ్యలక్ష్మిని మట్టిలో మాణిక్యంగా అభివర్ణించారు, అదే విధంగా ఉప్పునుంతల మండల పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి భాగ్యలక్ష్మి సత్కరించి 50 వేల రూపాయలు బహుమతిగా అందించారు.ముందు ముందు జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, మరియు జాతీయస్థాయిలో ఇంకెన్నో మెడల్స్, సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, బీసీ సెల్ మండల అధ్యక్షుడు, మడ్డి తిరుపతయ్య గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మహేష్, కౌన్సిలర్, గౌరీ శంకర్ ,బాబా, శేఖర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.