మధుమేహంపై ఉద్యమంలా ప్రచారం
ఖమ్మం, నవంబర్ 15 : మధుమేహ వ్యాధి మహమ్మారిలా విజృంభిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమేష్బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవన సరళిలో వస్తున్న మార్పులే దీనికి కారణమని అన్నారు. మధుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను ఉద్యమంలా ముందుకు తీసుకుపోతామని అన్నారు. మధుమేహ వ్యాధి తీవ్రత, కిడ్నీ, గుండె, మెదడు తదితర అవయవాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. సమతుల్య ఆహారం, వ్యాయామం అవసరమని అన్నారు. వీటితో వ్యాధిని అరికట్టవచ్చని అన్నారు.