మధ్యప్రదేశ్ రైలు ప్రమాదం చాలా బాధాకరం: మోదీ
ఢిల్లీ, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్ రైలు ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 30 మంది ప్రయాణికులు మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని మోదీ వ్యాఖ్యానించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా మధ్యప్రదేశ్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి సురేష్ప్రభు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్సింగ్ డిమాండ్ చేశారు