మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన సర్పంచ్ ,విద్య కమిటీీ చైర్మన్

మల్దకల్ అక్టోబర్15(జనం సాక్షి)మండల పరిధిలోని మల్దకల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం సర్పంచ్ యాకోబు, విద్య కమిటీ చైర్మన్ సిద్ధి నర్సింలు మధ్యాహ్నం భోజన పథకం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని వంట ఏజెన్సీ వారికి ఆదేశించారు. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం తో పాటు కోడిగుడ్డు అరటిపండు వారంలో రెండు రోజులు పాటు అందించాలని వారు సూచించారు. వీరి వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి మాబి తదితరులు ఉన్నారు.