మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలి

జవదేకర్‌ను కలసి విన్నవించిన ఎంపి కవిత

న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ను ఎంపీ కవిత నేతృత్వంలోని బృందం నేడు కలిసింది. పలువురు ఎంపీలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులతో కవిత.. కేంద్రమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులకు కనీస వేతనాన్ని పెంచాలని కేంద్రమంత్రిని ఎంపీ కవిత కోరారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులకు కనీస వేతనాన్ని వెయ్యి నుంచి పదివేల 500లకు పెంచాలని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ను ఎంపీ కవిత కోరారు. కేంద్ర కార్మిక చట్టాలను అనుసరించి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, సౌకర్యాలు కల్పించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఎంపీ కవిత ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు కలిశారు. 31 జిల్లాల ప్రతినిధుల బృందాన్ని.. ఎంపీ కవిత కేంద్ర కార్మికశాఖ ఉన్నతాధికారులతో సమావేశపరిచారు. సమస్యలను వివరించారు. మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది. అటు మధ్యాహ్న భోజన వంట కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఎంపీ కవిత కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌కు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది మధ్యాహ్న భోజన వంట కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం నెలకు పదివేల 500ల వేతనం అందేలా చూడాలన్నారు. 2010లో వీరికి వేతనాలు పెంచారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పెంచలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.