మనసున్న మాతృమూర్తి మదర్ తెరిసా:-

మిర్యాలగూడ. జనం సాక్షి
పేద ప్రజలను,మురికివాడల్లో నివసించే దళితులను అక్కున చేర్చుకున్న మనసున్న మాతృమూర్తి మదర్ తెరిసా అని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, సామాజికవేత్త రిషికేశ్వర్ రాజు లు అన్నారు. శుక్రవారం మదర్ తెరిసా 112 వ జయంతిని పురస్కరించుకొని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద తెరిసా చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. మదర్ తెరిసా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆశించిన తెరిసా ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు యాదవ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ ఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి ఫారుక్, బి ఎం పి పట్టణ కన్వీనర్ మోసిన్ అలీ,జయరాజు, రజక సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి సుధాకర్, బోప్పని నగేష్ తదితరులు పాల్గొన్నారు.