మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో విశిష్ట అభిషేకాలు నిర్వహించిన అర్చకులు

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రపంచంలో అరుదైన అత్యంత విశిష్టమైన మరకతం తో మలిచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం కానాజీ గూడలో ఆదివారం 32 ఔషధీకృత ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలు మోదకములు మరకత మహా లక్ష్మి హోమము నిర్వహించారు. డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పాటుపడాలని అన్న ప్రసాద్ వితరణ కు విరాళాలు అందజేయాలని భక్తులను కోరారు. నిరాటంకంగా సాగుతున్న అన్న ప్రసాద వితరణ చిలకల గూడ చౌరస్తాలో మరియు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ వద్ద అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అన్నార్తులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త అరణ్ జ్యోతి, గీత ప్రియా, భక్తులు పాల్గొన్నారు