మల్దకల్ దేవాలయంలో అన్నదానము

మల్దకల్ జూలై 2 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రజల ఇలవేల్పు అయిన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం దేవాలయానికి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించారు. మండల పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన తిమ్మప్ప స్వామి భక్తుడు తిమ్మయ్య శెట్టి ప్రతి శనివారం భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సిద్ధం చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రమేష్, దీరేంద్ర దాస్, రవి, వాల్మీకి పూజారులు,వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు మనసాని నాగరాజు,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాదం శ్రీనివాసులు,మండల అధ్యక్షులు మద్దెల బండ నాగరాజు,చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.
Attachments area