మల్లన్న స్వామి ఆలయంలో భక్తుల సందడి ……
కొమురవెల్లి జనం సాక్షి
ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి శ్రావణమాసం మూడవ ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో ఆలయంలో సందడి నెలకొంది ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తమ పిల్లాపాపలతో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారికి అభిషేకం నిత్య కల్యాణోత్సవం పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్థంబం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
